Saturday, April 20, 2024

16న రాంలీలా మైదానంలో ముచ్చటగా మూడోసారి…

- Advertisement -
- Advertisement -

kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడవసారి ఈ నెల 16వ తేదీన ఇక్కడి రాంలీలా మైదానంలో పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 62 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించింది. కాగా 2015లో 3 ఉన్న బిజెపి సంఖ్యాబలం తాజా ఎన్నికల్లో 8కి పెరిగింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఆప్‌కు అఖండ విజయాన్ని చేకూర్చినందుకు ఢిలీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ ఐ లవ్ యూ నినాదంతో ధన్యవాదాలు తెలిపారు. ఆప్ విజయంతో పనితనంతో కూడిన రాజనీతి జన్మించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Arvind Kejriwal to take oath on Feb 16, Arvind Kejriwal will sworn as Delhi CM third time at Ramlila maidan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News