- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: అయోధ్య చరిత్రలో బాబ్రీ మసీదు ఉంటుందని, ఆ ఘటన తుడిచిపెట్టుకుపోదని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. బుధవారం రామాలయ భూమి పూజపై అసదుద్దీన్ ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న రామమందిర నిర్మాణ డిమాండ్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. అయోధ్యలోని ఆ సంస్థ రాంలల్లాకు చెందుతుందని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అక్కడి ప్రాంతానికి సమీపంలో మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Asaduddin comments on Ayodhya Temple
- Advertisement -