Friday, April 19, 2024

పాక్‌-భారత్ మ్యాచ్‌పై అసద్ అభ్యంతరం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌-2021లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. కశ్మీర్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో తొమ్మిది మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెలరేగిపోతోన్న ఉగ్రవాదం వల్ల మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు టి20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడుతుండడపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Asaduddin Owaisi comments on IND vs PAK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News