- Advertisement -
మంచిర్యాల: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి ఎఎస్ఐ ఆడేలు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎఎస్ఐ తన క్వార్టర్స్ కు మరమ్మత్తులు చేస్తుండగా జారి కిందపడ్డారు. దీంతో ఆయన గొంతులో రేకు గుచ్చుకుంది. తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది హూటహుటిన ఎఎస్ఐ మంచిర్యాల సర్కార్ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ASI Died After Slips from His Quarter At Mancherial
- Advertisement -