Friday, March 29, 2024

కేంద్రం వల్లే ఆలస్యం

- Advertisement -
- Advertisement -

వ్యాక్సినేషన్ పాలసీ లోపభూయిష్టం

టీకాలన్నీ ప్రైవేటుకే పోతున్నాయి
గ్లోబల్ టెండర్లకు స్పందన లేకపోవడం దురదృష్టకరం
రోజుకు రాష్ట్రంలో 10లక్షల మందికి టీకా వేసే సామర్థం ఉన్నా సరిపడా సరఫరా లేదు
13.5 లక్షల మందికి రెండు డోసులు పూర్తి
వృద్ధాశ్రమాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రారంభం
మూడో దశపై కేంద్రానికి ప్రణాళిక ఉందో లేదో?
రూ.35వేల కోట్ల బడ్జెట్ ఎటు పోయిందో తెలియదు
విదేశాల్లో నిరుపయోగంగా 50కోట్ల కొవిషీల్డ్ డోసులు
ఆస్క్ కెటిఆర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి సమాధానాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, సామర్థ్యానికి తగినట్లుగా రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా లేదని మంత్రి కెటిఆర్ తెలిపారు. దేశంలో కొవిడ్ టీకాల కొరతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలను మరోసారి మంత్రి కెటిఆర్ ఎత్తిచూపారు. ఆదివారం సాయంత్రం ‘ఆస్క్ కెటిఆర్’ పేరుతో కొనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే, ప్రజల నుంచి వచ్చిన విలువైన సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను ప్రజలకు కెటిఆర్ వివరించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని, వృద్ధావ్రమాల్లోనూ వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యిం న్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేసే కా ర్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రం పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందన రాలేదన్నారు.

అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీదారులు దేశంలోని వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కన్నా కేవలం కేంద్ర ప్రభుత్వ ంతో సంప్రదింపులు జరిపేందుకు, కేంద్రానికే వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. వాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూ పుల వారీగా నిర్ణయం తీసుకోవడం కొంత అయోమయానికి దారితీస్తుందని, దీని బదులు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధంగా సూపర్ స్రైడ్‌లను గుర్తించి వారికి వ్యాక్సినేషన్ వేయడం ద్వారా మరిన్ని సత్ఫలితాలు పొందే అవకాశం ఉందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు 30 లక్షల మందిని గుర్తించిందని, వారికి సంబంధించిన వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా విదేశాల్లో వి ద్యను అభ్యసించేందుకు వెళ్లే వారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం ద్వారా వారి విలువైన విద్యా సమయం ఆదా అవుతుందన్నారు. ప్రజలకు 2 డోసుల వ్యాక్సిన్ అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనసాగిస్తున్నామని ఇప్పటికే 13 లక్షల మందికి రెండో డోసు పూర్తి అయ్యిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 65 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించామని ఆయన తెలిపారు.
రాష్ట్రాలకు తక్కువ రేటు, ప్రైవేటు ఆస్పత్రులకు ఎక్కువ రేటు
భారతదేశ జనాభా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాలంటే 272 కోట్ల వ్యాక్సిన్ అవసరం అవుతాయని దీనికి సంబంధించి 150 రూపాయలకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన 35 వేల కోట్ల రూపాయలను ఉపయోగించాలని, కానీ ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదన్నారు. దీంతో పాటు రాష్ట్రాలకు, ప్రైవేటు కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వానికి ఒక తీరున వ్యాక్సిన్ ధరను నిర్ణయించడం పైన కూడా ఆయన ట్విట్టర్లో స్పందించారు. దీంతోపాటు దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు 85 శాతం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయని మిగిలిన 15 శాతం లో రాష్ట్రాలకు తక్కువ రేటు, ప్రైవేటు ఆస్పత్రులకు ఎక్కువ రేటు నిర్ణయించడంతో కంపెనీలు కూడా ప్రైవేటు వర్గాలకే అమ్మేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సుముఖంగా లేవన్న విషయాన్ని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలియచేశారు.
మూడో వేవ్‌పై కేంద్రానికి ప్రణాళిక ఉందో లేదో ?
పైగా రాష్ట్ర ప్రభుత్వాలకు మే 1వ తేదీ తర్వాతే ఆర్డర్లను కంపెనీలకు అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. మూడో వేవ్ కరోనా నేపథ్యంలోనూ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరాకు సంబంధించిన ఒక ప్రణాళిక ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. భారత దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సిరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ నెలకు పది కోట్లకు మించి ఉత్పత్తి చేయలేవని, అయితే త్వరలోనే దేశ జనాభాలో 80శాతం ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న ప్రజలకు ఏ విధంగా రెండు డోసులు అందుతాయో లేదో కేంద్ర ప్రభుత్వం తెలపాలన్నారు.
జనవరిలో కేంద్రం మేల్కొంది
దేశీయంగా వ్యాక్సిన్ సరఫరా తగినంత లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం అమెరికా కెనడా డెన్మార్క్ నార్వే వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల వ్యాక్సిన్లకు సంబంధించి ఆయా దేశాలతో వెంటనే చర్చను ప్రారంభించి వాటిని భారతదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి కెటిఆర్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలో వ్యాక్సిన్లు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులో లేవన్న విషయానికి సంబంధించి మంత్రి కెటిఆర్ పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ఇతర దేశాలు గత సంవత్సరమే మేల్కొని పెద్దఎత్తున ఆయా కంపెనీలకు వ్యాక్సిన్లు సరఫరా కోసం ఆర్డర్ ఇచ్చాయని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో మేల్కొందన్నారు.
కెనడాలో ఒక వ్యక్తికి 9 డోసుల చొప్పున….
దీంతో పాటు ఇతర దేశాలు తమ ప్రజలకు పెద్దఎత్తున వ్యాక్సిన్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తుంటే భారత ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్ మైత్రీ, విదేశాలకు వాక్సిన్ ఎగుమతుల ప్రమోషన్‌లకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించిందన్నారు. అమెరికా, కెనడా వంటి దేశాలు తమ దేశ జనాభాకు అవసరమైన వాటి కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్లను ప్రోకూర్ చేసుకున్నాయని, ముఖ్యంగా కెనడా లాంటి దేశం ఒక వ్యక్తికి తొమ్మిది డోసుల చొప్పున వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
పలు దేశాల్లో ఉచితంగా వ్యాక్సిన్
వ్యాక్సిన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్న అంధ భక్తులకు మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా పలు చురకలంటించారు. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్ అందిస్తే భారతదేశ వ్యాక్సిన్ ప్రక్రియ కనీసం 10 శాతం కూడా దాటలేదన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, యూకె, జర్మనీ, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలన్నీ తమ పౌరులకు వాక్సిన్ ఉచితంగా అందిస్తే భారతదేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా కేంద్రం వ్యవహారిస్తోంద న్నారు.
విదేశాల్లో 50 కోట్లకు పైగా కోవిషీల్డ్ డోసులు నిరుపయోగం
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ తక్కువగా ఉందన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ కరోనా వస్తే పిల్లల పైన అధిక ప్రభావం చూపుతుందన్న భయాందోళన నేపథ్యంలో వారికి వ్యాక్సిన్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా వ్యాక్సిన్‌కి సంబంధించిన ట్రయల్స్ ప్రారంభమైనట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతో విదేశాల్లోనూ పలు ఇతర కంపెనీలు కూడా పిల్లలపైన వాక్సిన్ ట్రయల్స్‌ను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. అమెరికా, కెనడా, డెన్మార్క్, నార్వే వంటి విదేశాల్లో 50 కోట్లకు పైగా కోవిషీల్డ్ డోసులు నిరుపయోగంగా ఉన్నాయి. మిగులు టీకాలు ఉన్న దేశాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి వేగంగా వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా రాష్ట్రాలకు టీకాల సరఫరాను పెంచాలన్నారు. కరోనా వ్యాప్తి అవకాశం ఉన్నవారిని గుర్తించి టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని, అందులో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

#Ask KTR: KTR answer to netizens on Covid situation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News