- Advertisement -
కరోనా లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులకు గురైన సినీ కార్మికులను మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) నిత్యావసరాల సరుకులు అందజేసి ఆదుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినీ, టీవి కార్మికులకు సాయం చేయడానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముందుకొచ్చారు. సినీ పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వడానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. గురువారం నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో భాగంగా 14 వేల మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
- Advertisement -