Thursday, March 28, 2024

థాయ్‌లాండ్‌లో కాల్పులు… కనీసం 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Gun

బాంకాక్:   థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం 20 మంది మరణించినట్లు, 31 మంది మునిగిపోయినట్లు పోలీసు అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. “కనీసం 20 మంది మరణించారు, అయితే వివరాలు ఇంకా తెలియాల్సింది ఉంది” అని డిప్యూటీ పోలీసు ప్రతినిధి ఆర్కాన్ క్రైటాంగ్ రాయిటర్ వార్తా సంస్థకు తెలిపారు.

ముష్కరుడు ఓ సైనికుడని, భూ వివాదంపై కోపంతో కాల్పులు జరిపాడని  పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఈశాన్య థాయ్‌లాండ్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్‌లో తలదాచుకున్నాడు. కాగా  మాల్‌కు భద్రత కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

భవనం లోపల ఇంకా మృతదేహాలు లేవని ప్రజారోగ్య శాఖ మంత్రి అనుతిన్ చర్న్‌విరాకుల్ చెప్పారు. ” అయినప్పటికీ,అదనపు గాయాలు లేదా మరణాలు ఏమైనా సంభవించాయా లేదా అనేది మాకు తెలియదు” అని తెలిపారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి దొరికిపోయాడా లేదా అన్నది మాత్రం నిర్ధారించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News