Friday, March 29, 2024

ఆదిలాబాద్ లో ఎటిఎంలను ఎత్తుకెళ్లిన దుండగులు

- Advertisement -
- Advertisement -

ATMs theft in Adilabad district

 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూడు ప్రాంతాల్లో ఎటిఎం మిషన్లను చోరీ చేసిన సంఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గురువారం అర్ధరాత్రి కలెక్టర్ చౌక్‌లో ఎస్‌బిఐ ఎటిఎం మిషన్‌ను దుండుగులు ఎత్తుకెళ్లారు. ఈ ఎటిఎంలో దాదాపుగా రూ.30 లక్షలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు. దేవీచంద్‌చౌక్‌లోని జ్యువెలరీ షాపు సమీపంలో మరో రెండు ఎటిఎం మిషన్లు చోరీకి గురయ్యాయి. ఎటిఎం మిషన్లను బట్టిసవర్గామ్ బైపాస్ రోడ్డు సమీపంలో దుండగులు పడేశారు. మిషన్ల పగులగొట్టి అందులోని డబ్బులు తీసుకెళ్లారు. సిసి ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News