- Advertisement -
అమరావతి: బట్టలు ఆలస్యంగా కుట్టాడని ఓ టైలర్పై దాడి చేయడంతో అతడు మృతి చెందిన విశాఖ పట్నం జిల్లా మారికవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బొడ్డు లిమా(60) అనే టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బట్టలు ఆలస్యంగా కుట్టాడని టైలర్పై ఆరుగురు వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సదరు వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -