- Advertisement -
వనపర్తి: జిల్లాలోని మధనాపురం మండలం దుట్పల్లిలో శుక్రవారం జరిగిన జంట ఆత్మహత్యాయత్నం వనపర్తిలో కలకలం రేపుతోంది. పురుగులమందు తాగి యువకుడు శివ(22) యువతి పార్వతి(30) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారిని వనపర్తి సర్కార్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం యువకుడు, యువతి ప్రాణాలు విడిచారు. మృతులు ఇద్దరు వరసకు అత్తా, అల్లుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులు బొగ్గులోనికుంట పరిధిలోని స్కూల్ తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Aunt and son-in-law committed suicide at wanaparthy
- Advertisement -