Thursday, April 25, 2024

మూడో టి-20లో భారత్ ఓటమి

- Advertisement -
- Advertisement -

AUS W beat IND W with 14 runs in 3rd T20

గోల్డ్ కోస్ట్: గోల్‌డకోస్ట్ వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భార మహిళల జట్టుపై 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 2-0 తేడాతో ఆస్ట్రేలి యా సిరీస్‌ను కైవసం చేసుకుంది.149 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే షఫాలీ వర్మ వికెట్ కోల్పోయినా స్మృతి మంధానా, జెమిమా రోడ్రిగ్స్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో స్మృతి మంధానాఅర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మంధానా 49 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగు లు చేసింది. మంధానా ఔటయిన తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రకర్, హార్లిన్ డియోల్‌లు ఒకరితర్వాత ఒకరుగా పెవిలియన్ దారి పట్టారు. రిచాఘోష్(11 బంతుల్లో 22 పరుగులు నాటౌట్) చివర్లో దూకుడుగా ఆడినా భారత్‌ను విజయ తీరాలకు చేర్చలేకపోయింది. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నికోలా క్యారీ రెండు వికెట్లు పడగొట్టగా సదర్లాండ్,యాష్లే గార్డనర్, జార్జి యా వారహమ్ తలా ఒక వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 61, బెత్ మూనీ 44 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టగా, దీప్తి వర్మ, పూజా వస్త్రాకర్, రేణూ సింగ్‌లు తలా ఒక వికెట్ సాధించారు.

AUS W beat IND W with 14 runs in 3rd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News