Friday, April 19, 2024

ఆసీస్ 285/4

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆసీస్ జట్టు 104 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 285 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఉస్మాన్ ఖవాజా సెంచరీతో (122)చెలరేగాడు. కామెరూన్ గ్రీన్ (61) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ట్రావిస్ హెడ్ (32), మర్నాస్ లబుషింగే(03), స్టివెన్ స్మిత్ (38), పీటర్ హండ్సకోంబ్(17) పరుగులు చేసి ఔటయ్యారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News