Thursday, March 28, 2024

ఆసీస్ లక్ష్యం 288

- Advertisement -
- Advertisement -

 

అడిలైడ్: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 288 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఉంచింది. డావిడ్ మలాన్ సెంచరీతో చెలరేగాడు. 118 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ కు మలాన్ గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో డెవిడ్ విల్లీ(40 నాటౌట్), జోస్ బట్లర్(29), శ్యామ్ బిల్లింగ్స్(17), ఫిలీప్ సాల్ట్(14), క్రిష్ జోర్డాన్(14), లుక్ వుడ్(10), డావ్సన్(11) మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజీట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో అడమ్ జంపా, పాట్ కమ్నీస్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టు నడివిరిచారు. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టయినీస్ చెరో ఒక వికట్ తీసి పర్వాలేదనిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News