- Advertisement -
సిడ్నీ: సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీత్ లో 1-0 ఆధిక్యంలో ఆసీస్ ఉంది. తొలి వన్డేలో ఓడిన టీమిండియా ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్తో రెండో మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో నిలవాలని భారత్ భావిస్తుంటే, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ గెలవాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా కేవలం ఒకే మార్పుతో బరిలోకి దిగుతోంది. స్టోయినిస్ స్థానంలో హెన్రిక్స్ తీసుకున్నారు. ఇక భారత్ ఎలాంటి మార్పులు లేకుండానే ఆసీస్తో పోరాడేందుకు బరిలోకి దిగింది. భారత జట్టులో సమతూకం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- Advertisement -