Tuesday, April 16, 2024

మెదక్‌లో రోడ్డు ప్రమాదం.. అటో డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

Auto Driver died in Road Accident in Medak

మెదక్‌: జిల్లాలోని నిజాంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం నిజాంపేట గ్రామ శివారులో ఎదురెదురుగా వచ్చిన బైక్‌, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని హాబీబ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ జానీ(18)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Auto Driver died in Road Accident in Medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News