Saturday, April 20, 2024

ఫలక్‌నుమాలో ఆటోడ్రైవర్ హత్య

- Advertisement -
- Advertisement -

Auto-driver

చాంద్రాయణగుట్ట : ఓ ఆటోడ్రైవర్‌ను దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.చంద్రకుమార్ కథనం ప్రకారం… మంగళ్‌హాట్ పరిధిలోని దూల్‌పేట్ నివాసి మహ్మద్ జహంగీర్ కొడుకైన ఆటోడ్రైవర్ మహ్మద్ ఆజమ్ (25)ను బీబీకా చష్మా ప్రాంతంలో దుండగులు అడ్డగించి కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఫలక్‌నుమా ఎసిపి మహ్మద్ మజిద్, ఇన్‌స్పెక్టర్ కె.చంద్రకుమార్‌లు సంఘటనా స్థలికి చేరుకొని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం ఆజమ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి , అన్ని కోణాల్లో విచారిస్తునట్టు ఎసిపి మజిద్ తెలిపారు.

Auto driver Murder in Falaknuma Hyderabad 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News