Thursday, April 18, 2024

మెట్రోలో సురక్షిత ప్రయాణం కోసం అవగాహన కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

స్టార్‌మా, ఎల్ అండ్ టీ మెట్రో సంయుక్తంగా ప్రచారం
నగరంలో 57 మెట్రో స్టేషన్లలో కాన్‌కోర్స్, ఎంట్రీ,ఎగ్జిట్ చెక్ ఇన్
ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్ పాటు సందేశాలను ప్రచారం చేస్తాం: కెవిబి రెడ్డి

Awareness program for safe travel on the metro

మన తెలంగాణ,సిటీబ్యూరో : స్టార్ మా, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంయుక్తంగా ప్రభావంతమైన పౌర స్పృహ ఆదారిత ప్రచారాన్ని తెలుగు వినోదంకు సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద టెలివిజన్ ప్రోపర్టీ బిగ్ బాస్ ద్వారా సృష్టించాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణించేటప్పడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడమే లక్షంగా ఈప్రచారం ప్రారంభించారు. ఈపౌరస్పృహ కార్యక్రమాన్ని నగరంలో 57 మెట్రో స్టేషన్‌లలోని కాన్‌కోర్స్, ఎంట్రీ ఎగ్జిట్ చెక్ ఇన్ ప్రాంగణంలో చేస్తున్నారు.

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్‌తో పాటుగా అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈక్యాంపెయిన్‌ను మొత్తం బిగ్‌బాస్ సీజన్ 100 రోజులు ప్రచారం చేయనున్నారు. తద్వారా మెట్రో కమ్యూటర్లు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా మెట్రో స్టేషన్ ప్రాంగణాల్లో అనుసరించాల్సిన విధానాలను గురించి అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబందనలు, తమ సౌకర్యం కోసం సరైన విధానంలో మరింతగా వినియోగించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించడం వంటి తెలుపున్నారు. బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ వినోదానికి ఓసహేతుకమైన విధానమంటూ ఉండాలి.

ఈప్రచార ఆవిధానానికి చక్కటి ప్రాధానిద్యం వహిస్తుందన్నారు. బిగ్‌బాస్ అనేది పూర్తి వినోదాత్మక కార్యక్రమం. బావోద్యేగాలను తట్టి లేపుతుంది ఈప్రచారం ద్వారా భద్రత పట్ల మరింత అవగాహన సృష్టించే ప్రయత్నాం చేస్తున్నారు. ఇది ప్రయాణీకులకు చక్కటి విలువను జోడించనుంది. స్టార్ మా ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఈ తరహా సృజనాత్మక, సామాజికంగా బాధ్యతాయుతమైన ప్రచారం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా ఎండీ, సీఈవో, ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ కెవీబీరెడ్డి వివరిస్తూ బిగ్‌బాస్ సీజన్3 కోసం 2019లో మేము స్టార్ మాతో విజయవంతంగా భాగస్వామ్యం చేసుకున్నాం. మరోమారు ఉత్సాహపూరితమైన భాగస్వామ్యంను హైదరాబాద్ మెట్రో రైల్‌తో స్టార్‌మా, బిగ్‌బాస్ సీజన్ 5 చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందన్నారు. వారి పర్యావరణ అనుకూల, సురక్షితమైన ట్రావెల్ భాగస్వామిగా మేము నిలుస్తున్నామని తెలిపారు.

ఈభాగస్వామంలో భాగంగా మేము బిగ్‌బాస్ ఈజ్ వాచింగ్ ప్రచారంను మా మెట్రో స్టేషన్ల వద్ద ప్రారంభించామని, దీని ద్వారా కోవిడ్ భద్రత అవగాహన, సురక్షిత ప్రయాణ పద్దతులు వంటి వాటి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈప్రచారం ద్వారా స్మార్ట్ ట్రావెల్ అలవాట్లను ప్రయాణీకుల నడుమ పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా మెట్రో ప్రయాణికులు మొబైల్ క్యుఆర్ టికెట్లు, స్మార్ట్ కార్డులను సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వినియోగించాల్సిన చెబుతున్నాం, బిగ్‌బాస్ సీజన్5 ఈపూర్వ విజయం సాధించాలని సూపర్‌స్టార్ నాగార్జున, స్టార్ మా నెట్‌వర్క్‌కు నాఆక్షాంక్షలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఓనెట్‌వర్క్‌గా డిస్సీ, స్టార్ ఇండియా ఎప్పడు కూడా అర్దవంతమైన కమ్యూనికేషన్స్ సృష్టించడం ద్వారా లక్షలాది మంది జీవితాలను సమృద్ది చేయడాన్ని నమ్ముతుంటుందని, మాసందేశాల ద్వారా సంబంధిత సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తుంటాం. నగరంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మెట్రో రైల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మా అతిపెద్ద ప్రొపర్టీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. తెలుగు ప్రేక్షకులు దీనిని తమ రోజువారీ వినోదం కోసం అంగీకరించారని, ఈమార్గాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజా భద్రతకు సంబంధించి వేగంగా చేరుకోగలమని స్టార మా అధికారి ప్రతినిధి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News