Friday, March 29, 2024

మురికి కాలువలో పడి చిన్నారి మృతి…

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కుంటాల: మంచిర్యాల జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండి సఫిరా(02) పాప ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో పడి మృతి చెందింది. రెండేళ్లకే నూరేళ్లు నిండడంతో తల్లిదండ్రులు ఇంట్లో పని చేస్తున్నా సమయంలో చిన్నారి సఫీరా ఆడుతూ పాడుతూ మురికి కాలువ వైపు వెళ్లీ అందులో పడి మృతి చెందింది. అప్పటి వరకు బాగానే ఉన్న పాప అంతలోనే అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News