Saturday, April 20, 2024

కరోనా వ్యాధి నిరోధానికి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

ktr

 

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేశారు.

Balakrishna

 

లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి.కళ్యాణ్‌కు అందించారు.స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని, ఈ వైరస్‌ను అరికట్టడంలో మనందరం భాగస్వామ్యులం కావాలని పిలుపునిచ్చారు. ఇక బాలకృష్ణ కరోనా వ్యాధి నిరోధానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి గాను 50 లక్షల రూపాయల చెక్‌ను రాష్ట్ర మంత్రి కెటిఆర్‌కు అందచేశారు . అయితే సిసిసి సంస్థకు విరాళాన్ని అందజేసిన నందమూరి బాలకృష్ణను ట్విట్టర్ వేదికగా “థ్యాంక్యూ డియర్ బ్రదర్ బాలయ్యా..” అని అభినందించారు చిరంజీవి. “ప్రజలకు ఏ కష్టమొచ్చినా నువ్వెప్పుడూ ముందుంటావు..” అని చిరంజీవి ఈ సందర్భంగా బాలకృష్ణను ప్రశంసించారు.

 

Balakrishna donates 1 crore 25 lakhs for prevention corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News