Friday, April 26, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘అఖండ’ టీమ్..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారిని ‘అఖండ’ మూవీ టీమ్ దర్శించుకుంది. గురువారం ఉదయం నందమూరి బాలకృష్ణ, సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిలు విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితుల్లో ‘అఖండ’ సినిమాను ఎంతో ధైర్య సాహసాలతో విడుదల చేశామన్నారు. ప్రేక్షకులు ‘అఖండ’ సినిమాను ఆదరించి ఘన విజయాన్ని అందించారన్నారు. అందుకు ఎంతో సంతోషిస్తున్నానని బాలయ్య చెప్పారు. ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఊపిరిపోశారని పేర్కొన్నారు.

Balakrishna Visits Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News