Wednesday, April 24, 2024

బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు

- Advertisement -
- Advertisement -

Balapur Ganesh Festival Committee Key Decisions

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ దృష్ట్యా బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ గురువారం నిర్వహించిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.  బాలపూర్ లో ఈ సంవత్సరం 6 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించింది. ఈ ఏడాది లడ్డూ వేలం కూడా నిర్వహించవద్దని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాత్రమే తొలిపూజ చేయాలని బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది భక్తుల పూజలు, దర్శనాలు రద్దు చేస్తున్నట్టు కమిటీ సూచించింది. గణేశ్ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కమిటీ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News