- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ దృష్ట్యా బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ గురువారం నిర్వహించిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బాలపూర్ లో ఈ సంవత్సరం 6 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించింది. ఈ ఏడాది లడ్డూ వేలం కూడా నిర్వహించవద్దని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాత్రమే తొలిపూజ చేయాలని బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది భక్తుల పూజలు, దర్శనాలు రద్దు చేస్తున్నట్టు కమిటీ సూచించింది. గణేశ్ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కమిటీ పేర్కొంది.
- Advertisement -