Tuesday, April 23, 2024

బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి: బాల్కా సుమన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి తీరు గుమ్మడికాయ దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్న చందాన ఉందని ఘాటుగా విమర్శించారు. ఈటల భూఆక్రమాలపై ఐదుగురు ఐఎఎస్‌లతో ప్రభుత్వం కమిటీ వేసిందని, అన్ని విషయాలు బయటికొస్తే రేవంత్‌రెడ్డి నిజ స్వరూపం బట్టబయలవుతుందన్నారు. దేవరయాంజల్ భూముల్లో అక్రమాలను ప్రభుత్వం నిగ్గు తేల్చుతుందని బాల్క సుమన్ పేర్కొన్నారు.
విచారణలో ఇంచి భూమి ఎవరిదైనా వివరాలు బయటకు వస్తాయన్నారు. విచారణ మొదలు కాకముందే రేవంత్‌రెడ్డికి అనుమానాలు, భయాలు ఎందుకు? నమస్తే తెలంగాణ ముద్రణాలయం ఆ భూముల్లో ఉంటే విచాచరణలో ఆ విషయం కూడా బయటకు వస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి బినామీలు ఉంటే ఆ వివరాలు కూడా బయటకు వస్తాయని బాల్కా సుమన్ అన్నారు. సిఎం కెసిఆర్ ఐఏఎస్ అధికారులతో విచారణ కమిటీ వేస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారన్నారు. ఏవో రెండు కాగితాలు తెచ్చి అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దల మీద మాట్లాడుతానంటే రేవంత్‌రెడ్డికి కుదరదని బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చీకటి దందాలు చేస్తాం.. విచారణ మాత్రం వద్దు అని రేవంత్ చెబుతున్నారా? అని ప్రశ్నించారు. నోరుంది కదా అని రేవంత్ ఏం మాట్లాడినా చెల్లుతుంది అంటే కుదరదని బాల్కా సుమన్ అన్నారు.
ఏ విషయమైనా విచారణలో బయల్పడుతుందన్నారు. అప్పుడే ఆగమాగం ఎందుకు? అని ప్రశ్నించారు. బినామీల వ్యవహారం బయటపడుతుందని రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని, ప్రజాక్షేత్రంలో అందరి సంగతి తేలుతుందన్నారు. రేవంత్ తీరు గురవిందను గుర్తు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్‌లు, కబ్జాలు చేస్తున్నాడు కాబట్టే భయపడుతున్నాడని బాల్కా సుమన్ అన్నారు. భూఅక్రమాలపై ఐదుగురు ఐఎఎస్ అధికారులతో సిఎం కెసిఆర్ విచారణ కమిటీ వేశారంటేనే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని బాల్కా సుమన్ పేర్కొన్నారు.

Balka Suman fires on Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News