Friday, April 19, 2024

రూ.10 కోట్లతో బమ్మెర పోతన సమాధి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Bammera pothanna tomb will constructed

 

వరంగల్: వరంగల్‌లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలు జరపడం గర్వకారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్‌లో తెలుగు జర్నలిజం పరిణామ క్రమంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎర్రబెల్లి మాట్లాడారు. జర్నలిస్టులందరూ సువరం ప్రతాప రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సురవరం జర్నలిస్టుగా, ప్రజాప్రతినిధిగా, ఎంఎల్‌ఎగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. ప్రస్తుతం పని చేస్తున్న జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని ఎర్రబెల్లి వివరించారు. పది కోట్ల రూపాయలతో మహాకవి బమ్మెర పోతన సమాధిని నిర్మిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కవి రచయిత కసిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News