Friday, April 19, 2024

జులై 1నుంచి ఆ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

- Advertisement -
- Advertisement -

Ban on those plastic items from July 1st

 

ఢిల్లీ : ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై జులై 1నుంచి నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇయర్ బడ్స్, బుగ్గలు, క్యాండీ, ఐస్ క్రీంల కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు,కత్తులు , ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, ఆహ్వానపత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ లలోపు ఉండే పివిసి బ్యానర్లు, అలంకరణకోసం వాడే పాలిస్ట్రైరిన్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రధాన మంత్రి పిలుపుమేరకు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. పెట్రో కెమికల్ సంస్థలేవీ ప్లాస్టిక్ ముడిసరుకును ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీచేసినట్లు కేంద్ర ప్రభ్వుత్వ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News