Thursday, April 25, 2024

అండర్19 వరల్డ్ కప్ ఫైనల్: 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లా..

- Advertisement -
- Advertisement -

 

దక్షిణాఫ్రికా: అండర్ 19 వరల్డ్ కప్ 2020లో భాగంగా భారత్ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతోంది. భారత బౌలర్ బిష్నోయ్ అద్భుత బౌలింగ్ తో చెలరేగుతున్నాడు. కట్టుదిట్టమైన బంతులతో బంగ్లా బ్యాట్స్ మెన్స్ ను బోల్తా కొట్టించాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం బంగ్లా 21 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. క్రీజులో అక్బర్ అలీ(9), అవిషేక్ దాస్(0)లు ఆడుతున్నారు. భారత బౌలర్లలో బిష్నోయ్ నాలుగు వికెట్ల పడగొట్టగా, సుశాంత్ ఒక వికెట్ తీశాడు. కూడా బిష్నోయ్ ఆలౌటైంది.

BAN U lost 5th wicket at 87 runs against IND U

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News