Thursday, March 28, 2024

ఇండ్లలోనే బోనాల పండుగ జరుపుకోండి

- Advertisement -
- Advertisement -

bandaru dattatreya says Celebrate Bonalu festival at home

హైదరాబాద్ : బోనాల జాతర ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నగర వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్(లష్కర్) బోనాలు ఎంతో చారిత్రకమైనవని, ఈ జాతరలో జంట నగరాల వాసులే కాకుండా తెలంగాణలో ని అనేక ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారన్నారు. 1869లో మలేరియా ప్రబలి చూస్తుండగానే వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ప్రకృతి మాతను శాంతింపజేయడానికి ఉత్సవాలు, జాత రలు జరిపారని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ప్రజలు కూడా తమ తమ ఇండ్లలోనే స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌ల ధారణతో అమ్మవారికి బోనాలు సమర్పించి పండుగను నిర్వహించుకోవాలని దత్తాత్రేయ ప్రజలకు సూచించారు.

bandaru dattatreya says Celebrate Bonalu festival at home

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News