Friday, April 26, 2024

ఈటలను పరామర్శించిన బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. పాదయాత్రలో భాగంగా వీణవంక మండలం కొండపాకలో అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ ను మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు శనివారం జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. దీంతో బండి సంజయ్, మాజీ ఎంపి వివేక్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈటలను కలిసి పరామర్శించారు. ఈటల ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈటల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈటలకు కోవిడ్ ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Bandi Sanjay visits Etela Rajender in Apollo hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News