Friday, April 19, 2024

మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

ఛట్టోగ్రామ్: జహుర్ అహ్మాద్ చౌదరీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు బంగ్లాదేశ్ 71 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. నిజ్ముల్ హుస్సేన్ శాంటో, జాకీర్ హుస్సేన్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. ఓపెనర్లు తొలి వికెట్‌పై 124 పరుగులు చేశారు. నిజ్ముల్ 67 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. యాసిర్ అలీ ఐదు పరుగులు చేసి అక్షర పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కెప్టెన్ లిట్టన్ దాస్ 19 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఉమేష్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. భారత జట్టు ఇప్పటి వరకు 337 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జాకీర్ హసన్(82), ముష్పీకర్ రహీమ్ (02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 404
ఇండియా రెండో ఇన్నింగ్స్: 258/2 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News