Friday, March 29, 2024

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

 

మీర్‌పూర్:షీర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు బంగ్లాదేశ్ 21 ఓవర్ల రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. నిజ్మల్ హోస్సేన్ శాంటో 24 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. జకీర్ హసన్ 15 పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో మామిముల్ హక్(11), షకిబ్ అల్ హసన్ (07) బ్యాటింగ్ చేస్తున్నారు.  ఇప్పటికే భారత్ జట్టు 1-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News