- Advertisement -
హైదరాబాద్: కరోనా కారణంగా లాక్ డౌన్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న నేపథ్యంలో ఓ పోలీసు అధికారి లంచాలకు పాల్పడుతున్నాడు. దీంతో శనివారం బంజారాహిల్స్ లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్ఐ రవీందర్ నాయక్ ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికాడు. ఓ కేసు విషయం లో బాధితుడి నుంచి ఎస్ఐ రవీంద్ర నాయక్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి ఎస్సై రవీందర్ నాయక్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు రవీంద్ర నాయక్ ను విచారిస్తున్నారు.
Banjara Hills SI Ravindra Naik in ACB Net
- Advertisement -