Saturday, April 20, 2024

బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Bank robbery gang arrested in Rachakonda

హైదరాబాద్: రాచకొండ పరిధిలో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ పేర్ల మీద లోన్స్ తీసుకుని ఎగ్గొడుతోంది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కంపెనీ సృష్టించి క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ పేరుతో 2.50 కోట్లు రుణం తీసుకున్నారు. వరంగల్ నుండి అమాయకులను తీసుకొచ్చి ఆధార్ కార్డ్స్, ఫొటోస్ పెట్టి రుణాలు తీసుకున్నారు. వోక్స్ వెగన్ కార్ తో పాటు లావిష్ లైఫ్ ను నిందితుడు అలవాటు చేసుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 93 క్రెడిట్ డెబిట్ కార్డ్స్, 28 పాన్ కార్డు, 54 ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ నుండి తీసుకున్న డబ్బులతో ప్రతిరోజు నోవోటెల్ లో తన కుటుంబంతో బస చేశాడు. ఖరీదైన బట్టలు, షూస్, వాచ్, సెల్ ఫోన్స్ లతో పూణే, గోవా, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు. 100 కీలోల బరువున్న నిందితుడు ఎవరు గుర్తుపట్టకుండా బరువు తగ్గి స్లిమ్ గా మారాడాని పోలీసులు వెల్లడించారు. బ్యాంక్ అధికారుల పిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితులను ఎస్ఓటి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News