సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే షూటింగ్ ఆరంభానికి ఇంకా సమయం ఉంది. కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం విరామం లేకుండా జరుగుతోంది. ఇప్పటికే హీరోయిన్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక నివేదా థామస్ను కూడా ఈ చిత్రంలో లీడ్ పాత్రకు ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ చిత్రం కోసం ఓ ప్రముఖ స్టూడియోలో భారీ బ్యాంకు సెట్ను నిర్మిస్తున్నారట. దాదాపు అయిదు కోట్లు ఖర్చు చేసి ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్తో ఈ సెట్ను వేయిస్తున్నారు. కేవలం ఒక్క బ్యాంక్ అని కాకుండా పలు బ్యాంక్ల సెట్లను ఇందులోనే చూపించబోతున్నారు.
మొత్తం నాలుగు ఫ్లోర్స్లో ఈ సెట్ ఉంటుందని… అందులో పలు బ్యాంక్లు ఉంటాయని అంటున్నారు. సినిమా షూటింగ్ ఈ బ్యాంక్ సెట్టింగ్లో మొదలు కాబోతుందట. సినిమా షూటింగ్ ఎక్కువగా ఈ బ్యాంక్ల్లోనే జరుగుతుందట. అందుకే ఏకంగా అయిదు కోట్లు పెట్టి మరీ ఈ సెట్టింగ్ వేయిస్తున్నట్లుగా సమాచారం. విదేశీ బ్యాంక్ సెట్ కూడా ఇందులో ఉంటుందని టాక్. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మంచి మెసేజ్తో పాటు ప్రేమ కథ ఉంటుందని తెలిసింది.