- Advertisement -
జిహెచ్ఎంసి పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం
హైదరాబాద్: ఈ నెల 22న జిహెచ్ఎంసి పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్(22), మేడ్చల్ (15), రంగారెడ్డి(5), సంగారెడ్డి(3), బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో 123 బస్తీ దవాఖానాలున్నాయని, బస్తీ దవాఖానాలలో ప్రతి రోజు పది వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాలతో మరో నాలుగు వేల మందికి వైద్య సేవలు అందుతాయన్నారు. ఒక్కో బస్తీ దవాఖానలో ఒక వైద్యుడు, ఇక నర్స్, ఒక సహాయకుడు ఉంటాడన్నారు. ప్రజలకు వైద్య సేవలు మరింద చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
- Advertisement -