Saturday, April 20, 2024

బస్వాపూర్ రిజర్వాయర్ బాధితుడు గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి భువనగిరి: బస్వాపూర్ రిజర్వాయర్ బాధితుడు తిమ్మాపురం గ్రామానికి చెందిన జూపల్లి నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు. భర్త చావును తట్టుకోలేక భర్త మృతదేహం వద్ద చాతిలో నిప్పు అంటూ కుప్పకూలింది. భార్య అనితను అంబులెన్స్ లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ నిర్వాసితుడు జూపల్లి నర్సింహ పరిహారం కోసం 57 రోజులుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అధికారులు ఇళ్లకు నోటీసులు అంటించడంతో మనస్తాపంతో గుండెపోటుకు గురయ్యాడని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణం తట్టుకోలేక భార్య అనితకు కూడా చాతిలో నోప్పి అంటూ కిందపడడంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె భువనగిరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామ ప్రజలు, భూ నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News