Wednesday, April 24, 2024

మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బిబిసిఐ

- Advertisement -
- Advertisement -

టీమిండియా మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈసారి 17 మంది క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు దక్కాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్ కాంట్రాక్ట్‌లను దక్కించుకున్నారు.

Also Read: ఐపిఎల్ నుంచి వాషింగ్టన్ ఔట్..

గ్రేడ్‌బిలో రేణుకా సింగ్, జెమీమా, షఫాలీ, రిచా, రాజేశ్వరీ గైక్వాడ్‌లు ఉన్నారు. ఇక గ్రేడ్‌సిలో 9 మంది క్రికెటర్లు ఉన్నారు. వీరిలో తెలుగు క్రికెటర్లు మేఘన, అంజలి తదితరులు చోటు సంపాదించారు. కాగా, క్రికెటర్లకు చెల్లించే వేతన వివరాలను బిసిసిఐ ప్రకటించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News