Friday, April 19, 2024

చిరంజీవి కుటుంబంపై తేనెటీగలు దాడి

- Advertisement -
- Advertisement -

దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండలో చిరంజీవి కుటుంబంపై తేనెటీగలు దాడి చేశాయి. దోమకొండ కోటలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు చిరంజీవి, రాంచరణ్, ఉపాసన హాజరయ్యారు. తేనెటీగల దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ తెలిపారు. పది నిమిషాల తరువాత తేనెటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉమాపతి రావు కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాది రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్‌లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రేలు పరామర్శించడంతో వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News