Wednesday, April 17, 2024

క్యాన్సర్ తో బెంగాల్ డిప్యూటీ స్పీకర్ మృతి

- Advertisement -
- Advertisement -

Bengal Assembly deputy Speaker dies at 65

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సుకుమార్ హన్సడా (65) క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. సుకుమార్ క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సుకుమార్ చనిపోయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా అవనతం చేపట్టారు. ఝార్ గ్రామ్ నియోజకవర్గం నుంచి రెండ సార్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఎల్ఎగా గెలుపొందారు. సుకుమార్ అంత్యక్రియలు తన సొంత గ్రామం దబ్రాజ్ పూర్‌లో జరుగుతాయి. సుకుమార్‌కు భార్య ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. ప్రస్తుతం ఆయన ఎఐటిసి స్టేట్ ప్రెసిడెంట్ గా కూడా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News