Thursday, March 28, 2024

మమత సర్కార్‌పై గవర్నర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఈనెల 2న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఎంసి ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని విమర్శించారు. బాధిత ప్రాంతాల్లో తాను పర్యటించడానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదని ఆరోపించారు. ముందుగా అనుకున్న ప్రకారమే సొంత ఏర్పాట్లు చేసుకుని త్వరలో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. హింసకు బాధ్యులైన దుండగులను చట్టం ముందు నిలబెట్టాలని సూచించారు. హింస చెలరేగిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి, అదుపు చర్యలపై నివేదిక కోరినా రాష్ట్ర పోలీసులు ఇవ్వలేదని ఆరోపించారు.

Bengal Governor slams Mamata Govt over Violation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News