బెంగళూరు: సిఎఎకు వ్యతిరేకంగా నగరంలో గురువారం రాత్రి నిర్వహించిన సభలో మస్లీజ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి సమక్షంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని ఓ విద్యార్థిని నినాదాలు చేసింది. దీంతో సభా నిర్వాహకులు, అసదుద్దీన్ ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సభ ముగిసిన తర్వాత పోలీసులు.. వివాదాస్పదంగా నినాదాలు చేసిన సదరు విద్యార్థినిని బెంగళూరుకు చెందిన అమూల్య లియోన్(19)గా గుర్తించి అమెను అరెస్టు చేశారు. అలాగే ఆమెపై 124 ఎ, 153 ఎ, బి సెక్షన్ ల కింద దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపిన స్థానిక కోర్టు.. ఆమె బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు విననుంది. కాగా, సిఎఎ వ్యతిరేక సభలో వివాదాస్పద నినాదాలు చేసిన విద్యార్థినితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అసదుద్దీన్ ఓవైసి తెలిపారు.
#WATCH The full clip of the incident where a woman named Amulya at an anti-CAA-NRC rally in Bengaluru raised slogan of 'Pakistan zindabad' today. AIMIM Chief Asaddudin Owaisi present at rally stopped the woman from raising the slogan; He has condemned the incident. pic.twitter.com/wvzFIfbnAJ
— ANI (@ANI) February 20, 2020
Bengaluru Student Arrested for Raising Pakistan Zindabad