Wednesday, April 24, 2024

ముగిసిన ‘బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ లైవ్‌ కుకింగ్‌’ పోటీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ లైవ్‌ కుకింగ్‌ పోటీల గ్రాండ్‌ ఫైనల్‌ కెపీహెచ్‌బీలోని ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ గార్డెనియా వద్ద శనివారం జరిగింది. దీనికి సన్నాహంగా అక్టోబర్‌ 13వ తేదీన నల్లగండ్లలోని రత్నదీప్‌ స్టోర్‌లో చెఫ్‌ కృష్ణ తేజస్వితో ఫైనలిస్ట్‌లకు మీట్‌ అండ్‌ గ్రీట్‌ సెషన్‌ నిర్వహించి పోటీలకు ఏ విధంగా సిద్ధం కావాలి , వంటకాలను ఎలా అందంగా తీర్చిదిద్దాలి లాంటి అంశాలను తెలిపారు. బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌గా అపర్ణ హిల్‌ పార్క్‌కు చెందిన శ్రీమతి ప్రీతి జైన్‌ ఎంపిక కాగా, తరువాత స్ధానాల్లో అపర్ణ సైబర్‌ కమ్యూన్‌కు చెందిన శ్రీమతి దీప్తి, అపర్ణ సైబర్‌జోన్‌కు చెందిన శ్రీమతి అంకితా జి ఉన్నారు. రత్నదీప్‌ చెఫ్‌ అవార్డును వినూత్నమైన కుకింగ్‌కు గానూ ప్రణవ్‌ అంటిలియా కు చెందిన శిల్పకు అందజేశారు.ఈ ఇంటర్‌ హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ లైవ్‌ కుకింగ్‌ పోటీలను హైదరాబాద్‌ వ్యాప్తంగా 20 గేటెడ్‌ కమ్యూనిటీల వాప్తంగా నిర్వహించారు. ప్రతి సొసైటీ నుంచి ఓ ఫైనలిస్ట్‌ ఈ గ్రాండ్‌ ఫైనల్‌లో పాల్గొన్నారు.

ఈ పోటీల ప్రాధమిక రౌండ్లకు అపూర్వ ఆదరణ లభించింది. దాదాపు 400 మందికి పైగా ఈ పోటీల్లో పాలుపంచుకున్నారు. ఆడిషన్‌ రౌండ్స్‌లో చిన్నారులు, యువత, పెద్దలు, సీనియర్‌ సిటిజన్లు తమ అసాధారణ పాకశాస్త్ర నైపుణ్యం ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి రత్నదీప్‌ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించడంతో పాటుగా నూతన ప్రతిభావంతుల కోసం వర్క్‌షాప్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా రత్నదీప్‌ మార్కెటింగ్‌ డైరెక్టన్‌ యష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. హోమ్‌ చెఫ్‌లు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా తమ చుట్టుపక్కల వారితో బంధాన్నీ బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ ఆయిల్స్‌ సేల్స్‌ –మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ‘‘తమ సొంత ఫుడ్‌ తామే వండుకోవడంతో పాటుగా విభిన్నమైన పదార్థాలు వాడటాన్ని ప్రోత్సహిస్తుంటాము. ఈ బెస్ట్‌ చెఫ్‌ పోటీ మా ప్రయత్నాలకు కొనసాగింపు. ఈ పోటీలకు అపూర్వ ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. విజేతలకు అభినందనలు’’ అని అన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన చెఫ్‌ కృష్ణ తేజస్వి మాట్లాడుతూ హోమ్‌ చెఫ్స్‌ వండిన అద్భుతమైన వంటకాల రుచిని చూడటం సంతోషంగా ఉంది. విజేతలందరికీ అభినందనలన్నారు. ఎస్‌ఐపీఎల్‌ ఈవెంట్స్‌ ఫౌండర్‌ ప్రవీణ్‌ కె అగర్వాల్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఈ పోటీలను నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News