భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల మధ్య కలహాలు రావడంతో భర్తపై భార్య పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లెందు పట్టణానికి చెందిన నక్క కల్యాణ్(28), నిజాంపేటకు చెందని శైలజను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దర మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనషుల మధ్య పలుమార్లు పంచాయతీ పెట్టారు. ఐనా వారి మధ్య గొడవలు రోజు రోజుకు పెరుగుతుండడంతో బుధవారం రాత్రి నిద్రిస్తున్న కల్యాణ్ పై శైలజ పెట్రోల్ పోసి తగలబెట్టింది. కల్యాణ్ అరుస్తూ బయటకు పరుగులు తీశాడు, శైలజ కేకలు వేస్తూ బయటకు వెళ్లింది. స్థానికులు మంటలను ఆర్పేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్యాణ్ గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చనిపోయాడు. కల్యాణ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని సిఐ వేణుచందర్ తెలిపారు.
Bhadradri wife poured petrol on Husband after burn