- Advertisement -
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో భువనగిరి వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కిడ్నీలో స్టోన్స్ రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడానిరి రెడీ అయ్యాడు. అతడికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలో ప్రస్తుతం కరోనా వైరస్ 7800 మందికి సోకగా 210 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 3731 మంది కోలుకోగా 3861 మంది చికిత్స తీసుకుంటున్నారు. భారతదేశంలో కరోనా రోగులు సంఖ్య 4.25 లక్షలకు చేరుకోగా 13706 మంది చనిపోయారు.
- Advertisement -