Friday, March 29, 2024

గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. తాడిచెర్ల గ్రామానికి చెందిన జనగామ రవి( 30) గ్రామ సమీపంలోని గురువారం చెట్టుకు ఉరేసుకున్నాడు. అతని బంధువులకు మృతి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులు లేక అనారోగ్య సమస్యలతో అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News