Friday, April 26, 2024

భూపాలపల్లిలో భవన నిర్మాణ కార్మికుడి హత్య..

- Advertisement -
- Advertisement -

Bihar Labour murder in Bhupalpally

భూపాలపల్లి: జిల్లాలోని రేగొండలో బీహార్ భవన నిర్మాణ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. విరంచి అనే కార్మికుడిని తోటీ కార్మికులు మద్యం మత్తులో బండరాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పరారైన ఏడుగురు నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Bihar Labour murder in Bhupalpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News