పాట్నా: బిహార్ రాష్ట్రం ముంగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబంలో ఐదుగురు సభ్యులను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గ్రామస్థులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భారత్ కేసరి (50) అనే వ్యక్తి గడియారం రిపేర్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కేసరి గత కొన్ని రోజుల మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. తన తల్లి (80), భార్య ఆశాదేవి(45), శివాని కుమారి(16), సిమ్రాన్ కుమారి(14), సోనమ్ కుమారి(10)లను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గ్రామస్థులు భరత్ కేసిరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఐదు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఖరగ్పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
kesri climbed atop the roof and Jumped off the building, he injured critical