Friday, March 29, 2024

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బాలుడు.. అక్కడికక్కడే మృతి

- Advertisement -
- Advertisement -

Bike collides with electric pole boy dies in medchal

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్ మండలం బొమ్రాసిపేటలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇప్పుడిప్పుడే బైక్ నేర్చుకుంటున్న బాలుడు బైక్ తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదృష్టవశాత్తు వెనుక కూర్చున్న బాలికకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తాము ఎంత హెచ్చరిస్తున్న యువకుల్లో, తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.

Bike collides with electric pole boy dies in medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News