Thursday, April 25, 2024

పందిని తప్పించబోయి…. బైక్ పైనుంచి కిందపడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

pig

మనతెలంగాణ/భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన జొన్నల లక్ష్మన్(32) అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కుటుంబీకులు తెలపిన వివరాల ప్రకారం.. జొన్నల లక్ష్మన్ ఈ నెల 6వ తేదీన పెద్దమల్లారెడ్డి గ్రామానికి వెళ్లి రాత్రి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా అడవి పంది అడ్డు రావడంతో దానిని తప్పించబోయి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి సమాచారం అందించగా చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ మెడికేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పేర్కొన్నారు. లక్ష్మణ్ హైదరాబాద్‌లోని కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఉండేవాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News