Friday, March 29, 2024

23న ‘బిల్లా’ రీ రిలీజ్

- Advertisement -
- Advertisement -

BILLA Movie to Re-release on Oct 23

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అనుష్క నాయికగా, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ ఈ నెల 23న 4కె వర్షన్‌లో రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణం రాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ “ప్రభాస్‌తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక ఒరిజినల్ కథ చెప్పాను. దానికి బడ్జెట్ తక్కువ అవుతుంది. అలాగే ఈ ‘బిల్లా’ స్టోరీ చేద్దామన్నాను. దీనికి ఖర్చు ఎక్కువ. అయితే ఇండియన్ స్క్రీన్ మీద స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ రూపొందిద్దామని చెప్పాను. ‘తక్కువ బడ్జెట్ కథ ఎందుకు… ‘బిల్లా’నే చేద్దాం ఫిక్స్ చేయి డార్లింగ్’అని ప్రభాస్ అన్నారు. అలా ‘బిల్లా’ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై ప్రారంభించాం. ఈ సినిమా కోసం మేము అనుకున్నదానికంటే ఎక్కువ సపోర్ట్ చేశారు కృష్ణంరాజు. రెండు హెలికాప్టర్ లు అడిగితే నాలుగు తెప్పిద్దాం అనేవారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కార్లు కొన్నాం. కార్లను స్మాష్ చేశాం. ఈ చిత్రంలో కృష్ణంరాజు నటించాలనే ఆలోచన ప్రభాస్‌దే. పెదనాన్న నేనూ కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక డార్లింగ్ అని అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం. వాస్తవానికి ఈ 4కే షోను ఆయన ముఖ్య అతిథిగా పిలిచి ప్రదర్శించాలని అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తూ కృష్ణంరాజు మనకు దూరమయ్యారు. ఈ సినిమాను కేవలం నాలుగున్నర నెలల్లో షూట్ చేసి రిలీజ్ చేశాం. ప్రభాస్ కెరీర్‌లో బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం మరో ఆకర్షణ అయ్యింది. ది బెస్ట్ క్వాలిటీతో వరల్డ్‌వైడ్‌గా ఈ నెల 23న ‘బిల్లా’ రీ రిలీజ్ చేస్తున్నాం”అని అన్నారు.

BILLA Movie to Re-release on Oct 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News