- Advertisement -
హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభమయ్యింది. నగరంలో బయోడైవర్సిటీ ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ను ఐటి, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రూ. 30.26 కోట్లతో ఈ ఫ్లైఓవర్ పూర్తి కావడంతో.. ఎస్ఆర్డీపీ ప్యాకేజీ-4 కింద రూ.379 కోట్లతో జేఎన్టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు మొత్తం 12 కిలోమీటర్ల కారిడార్లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి.
biodiversity First level flyover starts in Hyderabad
- Advertisement -