Saturday, April 20, 2024

ప్రధాని మోడీకి పూణెలో ఆలయం

- Advertisement -
- Advertisement -

BJP activist built temple for PM Modi in Pune

పూణె: ప్రధాని నరేంద్రమోడీకి బిజెపి కార్యకర్త ఒకరు ఆలయం నిర్మించారు. 37 ఏళ్ల మయూర్‌ముండే పుణెలోని అవుంద్ ప్రాంతంలో ఓ చిన్న గుడిని మోడీకి నిర్మించారు. గుడి కోసం ఎరుపురంగు చలవరాయిని జైపూర్ నుంచి తెప్పించారు. గుడి నిర్మాణానికి లక్షా 60 వేల రూపాయాలు ఖర్చయ్యాయని తెలిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తీసుకున్న పలు నిర్ణయాలకు కృతజ్ఞతగా ఆలయాన్ని నిర్మించినట్టు ముండే తెలిపారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370 రద్దు, ట్రిపుల్‌తలాఖ్‌లాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మోడీకి కృతజ్ఞతాపూర్వకంగా గుడి నిర్మించినట్టు ముండే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News